పంత్ ను పరామర్శించిన ఉత్తరాఖండ్ సీఎం

పంత్ ను పరామర్శించిన ఉత్తరాఖండ్ సీఎం

డెహ్రాడూన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ ను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి పరామర్శించారు. డెహ్రాడూన్ లోని హాస్పిటల్ కు వెళ్లిన దామి చికిత్స పొందుతున్న పంత్ ను పరామర్శించారు. పంత్ కు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

పంత్ కు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మరోవైపు రోడ్డు ప్రమాదంలో పంత్ ను కాపాడిన వారిని జనవరి 26 న సన్మానిస్తామని సీఎం పుష్కర్ సింగ్ దామి తెలిపారు.