వీ6 కి ఆ వార్తతో ఎలాంటి సంబంధం లేదు.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం

వీ6 కి ఆ వార్తతో ఎలాంటి సంబంధం లేదు.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం

తమ లోగోతో తప్పుడు వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీ6-వెలుగు ప్రతినిధి సైబర్ క్రైమ్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము ఇప్పటివరకు గ్రేటర్ ఎలక్షన్స్‌‌కు సంబంధించి ఎలాంటి సర్వే చేయలేదని వీ6 న్యూస్ స్పష్టం చేసింది. సర్వే చేస్తే వీ6 టీవీ, వెలుగు పత్రికతో పాటు వీ6 సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌ల ద్వారా బాహాటంగా వెల్లడిస్తామని చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వీ6-వెలుగు సర్వే చేసినట్లు కొందరు తప్పుడు వార్తలు సృష్టించి సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్‌‌ చేస్తున్నారు. వీ6 వెలుగు లోగోలతో క్రియేట్‌‌ చేసిన ఫేక్‌‌ న్యూస్‌‌ల ద్వారా టీఆర్‌‌ఎస్‌‌కు ఎక్కువ సీట్లు, ఓట్లు వస్తాయని సర్వేలో తేలినట్లు చూపిస్తూ సోషల్‌ మీడియా గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నరు. జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసి లాభం పొందాలనే దురుద్దేశంతో కొందరు పని గట్టుకొని వీ6 వెలుగు మీడియా సంస్థల పేరుతో ప్రచారం చేస్తున్నారు. తమ సంస్థ లోగోలతో తప్పుడు పోస్టులు, స్ర్కీన్ షాట్లను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వీ6-వెలుగు యాజమాన్యం పోలీసులను కోరింది.

For More News..

భాగ్యనగర్ అంటే యువరాజ్ కేటీఆర్ నారాజయ్యారు

బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం

స్కానింగ్‌కు వచ్చిన గర్భవతిని తాగిన డాక్టర్..