- ఎంపిక చేసిన వాళ్లను సెంటర్లకు చేర్చాల్సిన బాధ్యత వాళ్లదే
- ఆఫీసర్లకు సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఎంపికైనవారిని వ్యాక్సినేషన్ సెంటర్లకు తీసుకొచ్చే బాధ్యత గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలదేనని సీఎం కేసీఆర్ అన్నారు. పోలీసులు, ఇతర భద్రతా బలగాల సిబ్బందికి వ్యాక్సిన్ వేయించే బాధ్యతను ఎస్సైలు, స్టేషన్ హౌజ్ఆఫీసర్లు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతున్న నేపథ్యంలో.. హెల్త్ ఆఫీసర్లు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. వ్యాక్సినేషన్కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఆఫీసర్లు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. 1,213 వ్యాక్సిన్ సెంటర్లు, 866 కోల్డ్ చైన్ పాయింట్స్ రెడీ చేశామని.. కేంద్రం నిర్ణయించిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను తొలుత హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, తర్వాత 50 ఏండ్లు దాటినవారికి, దీర్ఘకాలిక రోగులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సమీక్ష అయ్యాక కేసీఆర్ ఆఫీసర్లతో కలిసి ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. తర్వాత అధికారులకు కేసీఆర్ సూచనలు చేశారు. సర్కారు ఆర్డర్లో లబ్ధిదారులను వ్యాక్సినేషన్ సెంటర్లకు తీసుకురావాల్సిన బాధ్యతను సర్పంచులు, సెక్రటరీలు, ఎస్సైలకు అప్పగించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ట్రీట్మెంట్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ వ్యాక్సినేషన్లో పాల్గొనాలని సూచించారు.