హైదరబాద్, వెలుగు: వైభవ్ జ్యుయెలర్స్ తమ 15 వ షోరూమ్ను మంచిర్యాలలోని వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఓపెన్ చేసింది. విష్ణువర్ధన్ రావు (సర్వోదయ నర్సింగ్ హోమ్) స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రెసిడెంట్ తోగరు సుధాకర్, వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఎండీ నల్లా వెకంట నారాయణ, తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కోస్తాంధ్రా, తెలంగాణలో విస్తరించామని, తాజాగా మంచిర్యాలకు అదిరిపోయే నగల కలెక్షన్ను తీసుకొచ్చామని వైభవ్ జ్యుయెలర్స్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
916 హాల్ మార్క్ నగలు, సర్టిఫైడ్ డైమండ్స్, 925 స్వచ్ఛత కలిగిన సిల్వర్ , సాధారణ వెండి వస్తువులు, నగలను కస్టమర్ల ముందుకు తెచ్చామని సంస్థ ఎండీ భారత మల్లికా రత్న కుమారి గ్రంధి అన్నారు. కొత్త స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు నగలపై 9 శాతం తరుగు, ఏంటిక్ జ్యుయెలరీపై గ్రాముకు రూ.150 తగ్గింపు వంటి ఆఫర్లను సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా ‘మన మంచిర్యాల గురించి తెలుసుకుందాం’ కాంటెస్ట్ డ్రాలో గెలిచిన 10 మంది విజేతలకు ఒక్కొక్కరికి 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారు కాయిన్ను అందజేసింది.