తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంలో.. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తజనం పోటెత్తారు. ఏకాదశి రోజు వైకుంఠద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 

శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు పూర్తి చేశాక అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. ముందుగా వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు.