
- సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసిన వనపర్తి పోలీసులు
వనపర్తి,కొత్తకోట, వెలుగు: రెండు రాష్ట్రాల్లోని ప్రజలను నమ్మించి ఇండియా బుల్స్ / ధని, ముద్ర లోన్స్ పేరిట నాలుగేండ్లుగా దోచుకుంటున్న నిందితుడు అరెస్ట్ అయ్యాడు. కొత్తకోట సీఐ రాంబాబు తెలిపిన ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి ముందరి తండాకు చెందిన కిషన్తన తమ్ముడి ద్వారా బిహార్లోని పట్నాకు వెళ్లి సైబర్నేరాలు ఎలా చేయాలో శిక్షణ పొందాడు. అక్కడే కొన్ని నెలల పాటు సైబర్నేరాలు చేసి వనపర్తికి వచ్చాడు. రెండేళ్లుగా సైబర్నేరాలకు పాల్పడుతున్నాడు. బాధితుల ఫిర్యాదుతో పెద్దమందడి మండలానికి చెందిన ఎనిమిది మంది ముఠాను గత ఆగస్టు 29న అరెస్టు చేశారు.
గురువారం మరో నిందితుడు ముడావత్రమేశ్ను, శుక్రవారం ఇంకో నిందితుడు కిషన్ ను అరెస్టు చేసి ఇండ్ల ప్లాట్లు డాక్యుమెంట్లు, ఒక మారుతి బ్రెజా కారు, పాస్పోర్టు, వివిధ బ్యాంకుల అకౌంట్ బుక్స్, సెల్ఫోన్లు, కీ ప్యాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఇతడు తన తండావాసులకు కూడా సైబర్ నేరాలపై శిక్షణ ఇవ్వగా.. వారంతా పాట్నా, దిల్లీ, కోల్కతా, వనపర్తిలో ఆఫీసులు తెరచి సైబర్నేరాలకు పాల్పడుతున్నారని త్వరలోనే పట్టుకుంటామని సీఐ వివరించారు. జిల్లా ఎస్పీ గిరిధర్ అధ్వర్యంలో కొత్తకోట ఎస్ ఐ మంజునాథ్ రెడ్డి, శ్రీ రంగాపూర్ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, జిల్లా సైబర్ సెక్యూరిటీ ఇన్ చార్జి డీఎస్పీ ఎన్బీ రత్నం కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.