యూఎస్​లో వనపర్తి స్టూడెంట్ మృతి

యూఎస్​లో వనపర్తి స్టూడెంట్ మృతి

వనపర్తి, వెలుగు : వనపర్తి నుంచి పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ యువకుడు అక్కడ అనుమానాస్పదంగా చనిపోయాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని13వ వార్డుకు చెందిన గట్టు ఎంకన్న ఒక్కగానొక్క కొడుకు దినేశ్(23) బీటెక్​ పూర్తి చేశాడు. గత ఏడాది డిసెంబర్ 28న ఎంఎస్​చేయడానికి యూఎస్​వెళ్లాడు. అక్కడే ఫ్రెండ్స్​తో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసి తన రూమ్​లో పడుకున్న దినేశ్​ఉదయం లేవలేదు.

స్నేహితులు లేపడానికి ప్రయత్నించినా లేవలేదు. దీంతో చనిపోయాడని అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తమ కొడుకు అకస్మాత్తుగా చనిపోవడం ఏమిటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్​పాయిజన్​వల్లే చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. డెడ్​బాడీని త్వరగా తెప్పించేందుకు కృషి చేస్తానని, విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.