4 గంటలు ఆలస్యంగా వైజాగ్ వందే భారత్

4 గంటలు ఆలస్యంగా వైజాగ్  వందే భారత్

సికింద్రాబాద్​, వెలుగు: సికింద్రాబాద్– విశాఖపట్నం ​మధ్య నడుస్తున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్​ ​సోమవారం 4 గంటలు ఆలస్యంగా నడవనున్నదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

ఈ రైలు ప్రతి రోజు సికింద్రాబాద్​లో ఉదయం 5.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. పలు సాంకేతిక కారణాల వల్ల సోమవారం ఉదయం 5.05గంటలకు బదులుగా ఉదయం 9.05గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు చెప్పారు.