పద్మశ్రీ వనజీవి రామయ్యకు పవన్ కళ్యాణ్ పరామర్శ

పద్మశ్రీ వనజీవి రామయ్యకు పవన్ కళ్యాణ్ పరామర్శ

ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు, వృక్ష ప్రేమికుడు వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీడియో కాల్ లో పరామర్శించారు. యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వనజీవి రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలని అభిలాషిస్తున్నట్టు చెప్పారు. పచ్చదనం కోసం ఆయన పడే తపన, చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి కలిగిస్తాయన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో వనజీవి రామయ్య గాయపడ్డారు. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింపుపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఏమన్నారంటే..
మరో రెండు దేశాల్లో మంకీపాక్స్ కేసులు