థ్రిల్ చేసే శబరి

థ్రిల్ చేసే శబరి

తనదైన నటనతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న వరలక్ష్మి శరత్‌‌ కుమార్ తాజాగా మరో మూవీని మొదలుపెట్టింది. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ‘శబరి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. మహేంద్ర నాథ్ కొండ్ల నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని  నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌‌కి దర్శకుడు మదన్ కెమెరా స్విచాన్ చేశారు.  నిర్మాత సతీష్ వేగేశ్న క్లాప్ కొట్టారు.  దర్శకులు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు.  సీనియర్ నిర్మాత పోకూరి బాబూరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ..‘ఇదో సైకలాజికల్ థ్రిల్లర్.  ఈనెల 11నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. హైదరాబాద్, విశాఖపట్నం, కొడైకెనాల్‌‌లో షూట్ చేస్తాం’ అని చెప్పారు. గణేష్ వెంకట్రామన్, సునయన, రాజశ్రీ నాయర్, ప్రభు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.