వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. శనివారం ఈ చిత్రం నుంచి ‘‘కంసామ్నీడా (కొరియన్లో థ్యాంక్స్) ఎట్టా పుట్టావే భూమ్మీద..” అనే పాటను విడుదల చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. ‘‘నీ వేళ్లే పట్టి అందం నడక నేర్చేనే.. నీ శ్వాసే చుట్టి గాలికి ఊపిరి వచ్చేనే.. సన్నజాజి తీగే సన్యాసై పోయే..
చిన్ని నడుము చేసే వయ్యారాల ఆ మాయే.. ముద్దు ముద్దు గున్నదే అర్థం కాని నీ భాషే.. కోయిలమ్మ కూడా కొరియన్ లోనే కూసే..” అంటూ హీరోయిన్ అందచందాలు, గుణగణాలను గురించి హీరో పొగుడుతున్నట్టుగా సాగిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఇండో కొరియన్ బ్యాక్డ్రాప్లో హారర్, కామెడీ కలయికతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కమెడియన్ సత్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
