పలాస డైరెక్టర్తో వరుణ్ తేజ్ మూవీ .. ఆసక్తిగా మట్కా టైటిల్

పలాస డైరెక్టర్తో వరుణ్ తేజ్ మూవీ ..  ఆసక్తిగా మట్కా టైటిల్

మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej)  డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు.పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్(Karuna Kumar)  డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసేందే. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..VT14 గా వొస్తున్న ఈ మూవీకు 'మట్కా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మట్కా అనేది ఒక రకమైన జూదం. రిలీజ్ చేసిన పోస్టర్ లో రూపాయి కాయిన్..చుట్టూ నోట్ల కట్టలు..మధ్యలో కారు..ఒక ఇల్లు .. ఇలా పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. దీంతో ఈసారి వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ పడటం పక్కా అంటున్నారు మెగా ఫ్యాన్స్. 

ఈ మూవీ కథను 24 ఏళ్ళ టైమ్ పిరియాడ్ నేపథ్యంలో సాగుతూ..1958-1982 మధ్య జరిగే ఈ కథతో యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నరట. రా అండ్ ర‌స్టిక్ కంటెంట్ తో ఉన్న పోస్టర్ లో.. వ‌రుణ్ రోల్ చాలా మాసివ్ గా ఉంటుందని సమాచారం. ఈ విభిన్నమైన సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్లుక్స్ తో కనిపిస్తారని యూనిట్ పేర్కొంది. 

1960 గ్రామాల్లోని వాతావరణాన్ని క్రీయేట్ చేసేందుకు బెటర్ ఆర్ట్ టెక్నిషన్స్ ని రంగంలో దింపుతున్నారని తెలుస్తోంది. ప్రయోగాలు చేయటంలో వెనుకాడని వరుణ్ తేజ్.. సహజమైన డైరెక్షన్ తో ఆకట్టుకునే కరుణకుమార్ వీరిద్దరూ ఈ మూవీ కోసం భారీ సాహసం చేయబోతున్నారట. ఇవాళ (జూలై 27న) హైదరాబాద్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో టైటిల్ గ్రాండ్‌గా లాంచ్ చేయబడింది.

ఇందుకు ప్రొడ్యూసర్ సురేష్ బాబు..డైరెక్టర్ కరుణ కుమార్ కు స్క్రిప్ట్‌ను అందజేశారు. డైరెక్టర్ మారుతి కెమెరా స్విచాన్ చేయగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌బోర్డ్‌ను వినిపించారు. ఇక దిల్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. హరీష్ శంకర్ టైటిల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), నోరా ఫతేహి హీరోయిన్స్ గా సెలెక్ట్ అయ్యారు.  

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ మూవీను నిర్మించనున్నారు.ఈ మట్కా మూవీ వరుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రం కానుందని సమాచారం. ఆర్ట్ డైరెక్టర్ గా సురేష్. ఇక సౌత్‌లో మోస్ట్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ లో ఒకరైన జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రియాసేత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్..ప్రవీణ్  సత్తారు ( Praveen Sattaru ) డైరెక్షన్ లో రూపొందుతున్న గాండీవధారి అర్జున ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.