- కావాలనే కేటీఆర్, హరీశ్రావు ఆరోపణలు
- మీడియాతో వట్టినాగులపల్లి భూమి యజమానులు
పంజాగుట్ట, వెలుగు: వట్టినాగులపల్లిలో ఓ వ్యవసాయ భూమి విషయంలో జరుగుతున్న వివాదానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని సదరు భూమి యజమానులు స్పష్టం చేశారు.
మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్తో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని, బీఆర్ఎస్లీడర్లు కేటీఆర్, హరీశ్రావు అనవసరంగా మంత్రి కుటుంబసభ్యుల పేర్లను తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో భూయజమానులు అవినవ్ షా, సుధీర్కుమార్షా మాట్లాడారు.
