
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వర్సిటీల్లో చదువుతున్న యువతులను ‘వీ ఎనేబుల్’ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ ఓపెన్వర్సిటీతో వీహబ్ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఏటా 2 వేల మందికి కెరీర్ గైడెన్స్, పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యాలు, లైవ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఆవిష్కరణలపై శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ మూడు దశలుగా ఆరు నెలల పాటు నిర్వహిస్తారు. విద్యార్థినుల్లో విశ్వాసాన్ని పెంచేలా డిస్కవరీ (ఆవిష్కరణ), లర్నింగ్(నేర్చుకోవడం), ఇమ్మర్షన్(ప్రాజెక్ట్లో లీనమవడం) వంటి అంశాలపై ట్రైనింగ్ఇవ్వనున్నారు.
ఈ మేరకు శుక్రవారం ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో వీహబ్ సీఈవో సీతా పళచోళ్ల ఒప్పందంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీత.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో సాధికారత పెంచడం కోసం వీహబ్ నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థినులు, స్టార్టప్ఫౌండర్లు, క్షేత్ర స్థాయిలోని ఎంట్రప్రెన్యూర్లను గుర్తించి మెరుగుపరుస్తామన్నారు. మెప్మా, సెర్ప్, జిల్లా కలెక్టర్ల సహకారంతో పల్లెల్లో వీ ఎనేబుల్కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.విద్యార్థినుల్లో పోటీతత్వం, నైపుణ్యాలను పెంచేందుకు వీహబ్తో చేసుకున్న ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.