సాయిరామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. మార్చి 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ ‘నవీన్ రెడ్డి కథ చెప్పినప్పుడు అందులో కామెడీ, సెంటిమెంట్ బాగా నచ్చింది. ఇదొక మాస్ కామెడీ చిత్రం. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించాం. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది ఆసక్తిగా ఉంటుంది.
సాయిరామ్ శంకర్తో నాకు మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమాతో ఆయన కమ్ బ్యాక్ అవుతారని నమ్మకం ఉంది. ప్రీ ప్రొడక్షన్పై ఎక్కువ దృష్టి పెట్టి, కచ్చితమైన ప్లానింగ్తో 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. దీంతో ప్రొడక్షన్ ఖర్చు తగ్గింది. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’అని చెప్పారు.