ఉద్యోగుల సొసైటీ ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేయండి: వేం నరేందర్రెడ్డి

ఉద్యోగుల సొసైటీ ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేయండి: వేం నరేందర్రెడ్డి
  • వేం నరేందర్ రెడ్డికి  బీటీఎన్జీవో రిక్వెస్ట్

హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలోని భాగ్యనగర్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( బీటీఎన్జీవో )కు చెందిన 190 ఎకరాల ల్యాండ్​ను ఉద్యోగుల సొసైటీకి కేటాయించాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ కోరారు. సోమవారం ఈ అంశంపై టీఎన్జీవో మాజీ ప్రెసిడెంట్ కారం రవీందర్ రెడ్డితో కలిసి  ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ స్థలాలను వైఎస్సార్​ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి కేటాయించారని, వీటిని తీసుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 3 వేల మంది ఉద్యోగులు ఈ సొసైటీలో మెంబర్లుగా ఉండి ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఈ ల్యాండ్​పై హైకోర్టులో స్టే ఉందని, దీనిని తొలగించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.  

ఈ అంశాన్ని సీఎం రేవంత్​ దృష్టికి తీసుకెళ్తానని వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారని సత్యానారాయణ తెలిపారు.