రుద్రంగి మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా : ఆది శ్రీనివాస్

రుద్రంగి మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా : ఆది శ్రీనివాస్

చందుర్తి, వెలుగు: రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రైతుబంధు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు కేసీరెడ్డి నర్సారెడ్డి, శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ కమిటీ చైర్మన్ కొమిరె శంకర్, బీఆర్ఎస్ లీడర్లు ఆయన సమక్షంలో  కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రుద్రంగి మండలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.