"సీతారామం" చిత్రం పై వెంకయ్య ప్రశంసలు

 "సీతారామం" చిత్రం పై వెంకయ్య ప్రశంసలు


భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు "సీతారామం" చిత్రం పై  ప్రశంసలు కురిపించారు. నిన్న(బుధవారం) ఈ చిత్రాన్ని చూసిన ఆయన  ఇదోక అద్భుతమైన దృశ్యకావ్యం అని కొనియాడారు. ఈ మేరకు వెంకయ్య  తెలుగులో ట్వీట్ చేశారు.

"సీతారామం" చిత్రాన్ని వీక్షించాను. నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది.  చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని "సీతారామం" అందించింది. రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు" అని ట్వీట్ చేశారు.

హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో  దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్  హీరోయిన్ గా నటించారు. , రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది. ఆగస్ట్ 5న విడుదలైన  ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఇప్పటివరకు 50 కోట్లు వసూలు చేసింది.