ఉద్యమగడ్డపై విలక్షణ తీర్పు..సత్తాచాటిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి

ఉద్యమగడ్డపై విలక్షణ తీర్పు..సత్తాచాటిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి
  •     కామారెడ్డిలో కేసీఆర్​ ఓటమి

కామారెడ్డి, వెలుగు : ఉద్యమగడ్డ కామారెడ్డి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిచ్చింది. బీఆర్ఎస్​ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్, కాంగ్రెస్ ​నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి బరిలో నిలిచారు. బీజీపీ నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో కామారెడ్డి దేశం దృష్టిని ఆకర్షించింది.కేసీఆర్​అలవోకగా గెలుస్తారని కొందరు భావించగా, కామారెడ్డి రేవంత్​రెడ్డిదే అని తమ వాదన వినిపించారు.

ఇద్దరు సీఎం స్థాయి వ్యక్తులను కాదని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు స్థానిక నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డికి పట్టం కట్టారు. బీఆర్​ఎస్, కాంగ్రెస్​ హెలిక్యాప్టర్ ​లీడర్లంటూ.. తాను స్థానికుడిననే విషయాన్ని బలంగా తీసుకెళ్లారు. వివిధ సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేసిన కాటిపల్లి విజయం సాధించారు.