Neru Movie: మరో క్రైమ్ థ్రిల్లర్ రీమేక్లో వెంకీమామ..!

Neru Movie: మరో క్రైమ్ థ్రిల్లర్ రీమేక్లో వెంకీమామ..!

హీరో వెంకటేష్..ఫ్యామిలీ చిత్రాలకు..రీమేక్ చిత్రాలకు ఒక స్ట్రాంగ్ లేయర్ని క్రియేట్ చేశాడు.తన సినిమా కెరీర్లో రీమేక్ చిత్రాలకు, కోర్టు రూమ్ డ్రామా ఓరియెంటెడ్ సినిమాలకి వెంకీ పర్ఫెక్ట్గా సెట్ అవుతారని ప్రతి డైరెక్టర్ నమ్ముతారు. రీసెంట్గా నారప్ప సినిమాతో తనలోని మాస్..ఫ్యామిలీ ఎమోషన్ని చూపించిన వెంకీ..మరో ఇంటెన్స్ మూవీని రీమేక్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

రీసెంట్గా మోహన్‌‌‌‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన మూవీ నేరు (Neru). డిసెంబర్ 21న థియేటర్లో రిలీజై దూసుకెళ్తోన్న ఈ చిత్రాన్ని  ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్‌ (JeethuJoseph) తెరకెక్కించారు. షారుఖ్ డంకీ, ప్రభాస్ సలార్ మూవీస్కి  పోటీగా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది. ఈ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని దృశ్యం సిరీస్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్..కొత్త జోనర్ని టచ్ చేస్తూ తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. దీంతో నేరు మూవీ వెంకటేష్కి బాగా సూట్ అవుతుందనే విషయాన్ని..డైరెక్టర్ జీతూ జోసెఫ్ స్వయంగా ఓసారి చూడమని రిక్వెస్ట్ చేశారట. 

ప్రస్తుతం సైంధవ్ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్న వెంకటేష్..అతి త్వరలో తప్పకుండా నేరు సినిమా చూస్తానని మాట ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే, తన టీంతో నేరు సినిమా గురించి ఎంక్వైరీ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ వెంకటేష్ కి కనుక సినిమా నచ్చితే..తప్పకుండ రీమేక్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం థియేటర్లో దూసుకెళ్తోన్న నేరు మూవీ డబ్బింగ్ రైట్స్ను ఎవ్వరు సొంతం చేసుకోలేదని సమాచారం.

నేరు మూవీ కథ విషయానికి వస్తే.. 

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలపై జరుగుతోన్న అఘాయిత్యాలను చూపిస్తున్న చిత్రం నేరు. ఇందులో ఒక చూపు లేని అమ్మాయి  మానభంగానికి గురైతే దోషులను పట్టించే క్రమంలో..లాయర్ అయిన హీరో మోహన్ లాల్ ఈ కేసు కోసం ఎలా సహాయపడ్డాడు..అందుకు ఎదురయ్యిన అడ్డంకులు ఏంటీ అనే పాయింట్ తోనే ఈ సినిమా ఉంటుంది. కథ వింటే సింపుల్ గా..ఇప్పటికీ చాలా సినిమాల్లో తెలిసిన కథ అని అనిపించినా..దీని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఇంటెన్స్ కోర్ట్ సీన్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.