సీఎం బర్త్ డే వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం

సీఎం బర్త్ డే వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం

చౌటుప్పల్: సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల  ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉదయం 10 గంటల వరకు  బ్లడ్ డొనేషన్ క్యాంపుకు రావాలని టీఆర్ఎస్ నేతలను ఆదేశించారు కూసుకుంట్ల. అయితే 11 గంటలు దాటినా కార్యకర్తలు, నేతలు ఎవరూ రాలేదు. దీంతో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూసుకుంట్ల. అయితే వెన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నేతలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. చివరకు మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే వేర్వేరుగా బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. 

ఇవి కూడా చదవండి:

బీజేపీకి ఓటేసి తప్పు చేశాం