
కామన్ పోస్ట్గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 24తో ముగుస్తుందని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఈ నెల16 నుంచి ప్రారంభమైన వెరిఫికేషన్.. ఇప్పటి వరకు 21 సబ్జెక్టులకు సంబంధించి పూర్తి చేశామన్నారు. మరో 23 సబ్జెక్టులకు చెందిన కొందరు స్టూడెంట్స్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలన్నారు. సీపీజీఈటీలో 39 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇప్పటి వరకూ 27,580 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్లో పాల్గొన్నారని చెప్పారు.