తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం రాష్ట్ర వాప్తంగా  భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈనెల 25, 26,27వ తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో  వాతావరణ శాఖ తెలిపింది.