
మంచిర్యాల, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంచార పశువైద్య సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. 1962 అంబులెన్స్లో రోజూ ఊర్లు తిరుగుతూ పశువులకు వైద్యం చేస్తున్నా సకాలంలో శాలరీస్ అందక ఆర్థికంగా సతమతమవుతున్నారు. రాష్ట్రంలో వంద 1962 అంబులెన్స్ లు జీవీకే ఈఎంఆర్ఐ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. ఒక్కో వెహికల్లో వెటర్నరీ డాక్టర్, టెక్నీషియన్, డ్రైవర్, అటెండర్పని చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 మంది వరకు సిబ్బంది ఉన్నారు. ప్రభుత్వం జీవీకే ఈఎంఆర్ఐకి నెలనెలా ఫండ్స్రిలీజ్చేస్తే అందులో నుంచి స్టాఫ్శాలరీస్, వెహికల్స్మెయింటెనెన్స్చార్జీలు చెల్లిస్తారు. అయితే సిబ్బందికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్నెలల జీతాలు పెండింగ్ఉన్నాయి. చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నామని, అవీ నెలనెలా ఇయ్యట్లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సర్కారు ఫండ్స్రిలీజ్చేయాలని కోరుతున్నారు. లేదంటే వచ్చే నెల నుంచి అంబులెన్స్లు నడిపించే పరిస్థితి ఉండదని సిబ్బంది తెలిపారు.