డిసెంబర్ 27న తెలంగాణ రాష్ట్రానికి తొలి సారిగా రానున్న..ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్ ఖడ్​

డిసెంబర్ 27న తెలంగాణ రాష్ట్రానికి తొలి సారిగా రానున్న..ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్ ఖడ్​

హైదరాబాద్, వెలుగు : ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్ ఖడ్​ ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయా లని సీఎస్​ శాంతి కుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆమె శనివారం సెక్రటేరియెట్​లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రానికి రావడం తొలిసారి కావడంతో పోలీస్​ బందోబస్తు, పోలీస్​ బ్యాండ్​ను ఏర్పాటు చేయాలని సూచించారు.

బ్లూ బుక్​ ప్రకారం తగిన భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్, బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ఫైర్​ డిపార్ట్​మెంట్​ డీజీ నాగిరెడ్డి

ప్రభుత్వ కార్యదర్శి రాహుల్​ బొజ్జా, జీహెచ్​ఎంసీ కమిషనర్​ రొనాల్డ్​ రాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్​ క్రిస్టినా చొంగ్తు, ఆర్​ అండ్​ బీ సెక్రటరీ శ్రీనివాస్​ రాజు, టీఎస్​ఎస్​పీడీసీఎల్ ​సీఎండీ ముషారఫ్​తదితరులు పాల్గొన్నారు.