రామ‌మందిర నిర్మాణానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి విరాళం

రామ‌మందిర నిర్మాణానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి విరాళం

అయోధ్యలో రామ మందిర భూమిపూజ బుధ‌వారం వైభ‌వంగా జరిగింది. ప్రధాని మోడీ తన చేతుల మీదుగా మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని తన నివాసంలో స‌తీమ‌ణి ఉషమ్మతో క‌ల‌సి ప్రత్యేక పూజలు చేశారు. రామాయ‌ణాన్ని ప‌ఠించారు. రామమందిర నిర్మాణం కోసం శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఉప‌రాష్ట్ర‌ప‌తి రూ.5 లక్షల విరాళం అందించారు. అదే విధంగా కరోనా పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు పీఎం కేర్స్ నిధికి మ‌రో రూ.5 లక్షలు విరాళ‌మిచ్చారు.