లంచమిస్తేనే కావాల్సినట్టు క్యాస్ట్, ఇన్ కం .. రెవెన్యూ అధికారిపై సికింద్రాబాద్ ఆర్డీఓకు బాధితుల ఫిర్యాదు

లంచమిస్తేనే కావాల్సినట్టు క్యాస్ట్, ఇన్ కం .. రెవెన్యూ అధికారిపై సికింద్రాబాద్ ఆర్డీఓకు బాధితుల ఫిర్యాదు

పద్మారావునగర్, వెలుగు: రాజీవ్​యువ వికాసం పథకంలో భాగంగా క్యాస్ట్​, ఇన్​కం సర్టిఫికెట్ల కోసం అప్లై చేస్తే అనుకున్నట్టు ఇవ్వడానికి సికింద్రాబాద్​కు చెందిన రెవెన్యూ ఆఫీసర్​ఒకరు లంచం తీసుకుంటున్నారని బన్సీలాల్​పేట కాంగ్రెస్​ప్రెసిడెంట్ ఐత చిరంజీవి పలువురు బాధితులతో కలిసి బుధవారం సికింద్రాబాద్​ఆర్టీఎ సాయిరామ్ కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ ఆఫీసర్​కు రూ. 500, మరో స్టాఫ్​కు రూ.200 పంపిన గూగుల్​పే, ఫోన్​పే స్క్రీన్​షాట్లను అందజేశారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంచం ఇచ్చిన వారికి రూ.1.90 లక్షలు, ఇవ్వకపోతే రూ.2.20 లక్షల ఆదాయంతో సర్టిఫికెట్లు ఇస్తున్నారన్నారు. ఈ విషయమై తహసీల్దార్ పాండునాయక్ ను వివరణ కోరగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్​తో మాట్లాడానని ఆ ఫోన్​ఇంట్లో ఉంటుందని, ఎవరు డబ్బులు పంపారో తనకు తెలియదని చెప్తున్నారన్నారు. ఎవరో కావాలనే డబ్బులు పంపి తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని చెప్పారన్నారు.