
బషీర్ బాగ్, వెలుగు: ప్రీ లాంచ్ఆఫర్పేరుతో సాహితీ ఇన్ఫ్రా కంపెనీ తమను మోసం చేసిందని బాధితులు శనివారం బషీర్ బాగ్ లోని సీసీఎస్ ఆఫీస్ముందు ఆందోళనకు దిగారు. 2,500 మందిని మోసం చేసి రూ.1,500 కోట్లు కొట్టేసిందని ఆరోపించారు. ఈ సందర్భంగా బాధితులు సంపత్ రావు, శివాజీ, రఘునందన్ అడ్వకేట్స్పోతిరెడ్డి కృష్ణకాంత్, మురళీకృష్ణతో కలిసి మాట్లాడారు. సాహితీ ఇన్ఫ్రా కంపెనీ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ‘సాహితీ శర్వాణి ఎలైట్’ పేరుతో 25 ఎకరాల్లో 32 అంతస్తులతో 10 టవర్లు నిర్మిస్తామంటూ దాదాపు రూ.1,500 కోట్లు వసూలు చేసిందని చెప్పారు. ప్రీ లాంచ్ఆఫర్అంటూ తక్కువ ధరకు ఫ్లాట్లు ఇస్తామంటే ఎంతో మంది డబ్బులు కట్టారని తెలిపారు.
చివరికి కంపెనీ మోసం చేసిందని వాపోయారు. తమకు స్థలం లేదా డబ్బులు ఇప్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫాస్ట్ట్రాక్కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ లో బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని, అందుకే విచారణ ఆలస్యం అయిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి, తమకు న్యాయం చేయాలని కోరారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు అరెస్ట్కావడంతో ఈ కేసు నీరుగారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన స్థానంలో మరో అధికారిని నియమించి, దర్యాప్తును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.