కాంగ్రెస్​ లోకి విద్యా స్రవంతి .. దీపాదాస్​ మున్షి సమక్షంలో చేరిక

కాంగ్రెస్​ లోకి విద్యా స్రవంతి ..  దీపాదాస్​ మున్షి సమక్షంలో చేరిక

హైదరాబాద్, వెలుగు: డా. విద్యా స్రవంతి అధికార కాంగ్రెస్ పార్టీలో  చేరారు.  శుక్రవారం గాంధీ భవన్ లో  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్  దీపాదాస్​ మున్షి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నా రు. ఈ సందర్భంగా దీపాదాస్​ మున్షి మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్​ రోజురోజుకు బలపడుతున్నదని తెలిపారు.కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చినవారు పార్టీలో చేరాలన్నారు.

విద్యాస్రవంతి లాంటి విద్యావేత్తలు, మేధావులు పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు.  కాంగ్రెస్​లో చేరే వారికి తగిన ప్రాధాన్యమిస్తామని దీపాదాస్​ మున్షి పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలున్న కాంగ్రెస్​ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని విద్యా స్రవంతి అన్నారు. సోనియా గాంధీ, సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల నేతృత్వంలో పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు.