మహాదేవపూర్ నుంచి హైదరాబాద్ వరకు..కాళేశ్వరం పై కొనసాగుతున్న దర్యాప్తు

మహాదేవపూర్ నుంచి హైదరాబాద్ వరకు..కాళేశ్వరం పై కొనసాగుతున్న దర్యాప్తు

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలు, కుంగిన మేడిగడ్డ పిల్లర్స్ పై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి పది కార్యాలయాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. 

మహాదేవపూర్ కార్యాలయం నుంచి హైదరాబాద్ జలసౌధ కార్యాలయం వరకు సోదాలు జరుగుతున్నాయి. కాగా, సోమవారం రాత్రి కన్నెపల్లి పంపు హౌస్, మేడిగడ్డ బ్యారేజీ కార్యాలయాల్లోని రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్ డిస్క్ లు, పలు కీలక ఫైల్స్ ను డివిజన్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. భారీ పోలీస్ బందోబస్తుతో  మేడిగడ్డ గెస్ట్ హౌజ్ లో అధికారులు రాత్రి బస చేశారు. ఇవాళ ఉదయం నుంచి మహాదేవపూర్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు.