పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని సాయిగణేశ్ రైస్ ఇండస్ట్రీస్లో సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్, సివిల్ సప్లై ఆఫీసర్లు రైడ్ చేశారు. 2022–-23 యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వానికి బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. జూన్ 3న సదరు రైస్మిల్లు ఓనర్లకు అధికారులు నోటీసు ఇచ్చారు. అయినప్పటికీ బకాయిలు చెల్లించకపోవడంతో సోమవారం రైడ్ చేశారు.
4,946.080 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.18,35,83,057 బకాయి ఉన్నట్లు అధికారులు తేల్చారు. మూడు రోజుల్లో అమౌంట్ చెల్లించకపోతే రైసు మిల్లు యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వనపర్తి సివిల్ సప్లై జిల్లా మేనేజరు ఎన్.ఆంజనేయులు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశం, సీఐ పండరి, ఎస్సై సాంబశివరావు, సివిల్సప్లై డీటీలు ప్రసాద్, పరమేశ్ పాల్గొన్నారు.
