
అజయ్ దిషన్, ధనుష జంటగా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం'బుకీ'. హీరో విజయ్ ఆంటోనీతో కలిసి రామాంజనేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. సోమవారం రామానాయుడు స్టూడియోస్లో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సత్యదేవ్ క్లాప్ కొట్టగా, నిర్మాత సి.కళ్యాణ్ కెమెరా స్విచాన్ చేశారు. మంచు లక్ష్మి స్క్రిప్ట్ను టీమ్ మెంబర్స్కు అందజేశారు. నిర్మాతలు విజయ్ ఆంటోని, రామాంజనేయులు గౌరవ దర్శకత్వం వహించారు. కమర్షియల్ కంటెంట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు విజయ్ ఆంటోనీ చెప్పాడు.
యూనివర్సల్గా అందరికీ అర్థమయ్యే కథతో ఈ సినిమా రూపొందుతోందని మంచు లక్ష్మి తెలిపారు. సునీల్, మంచు లక్ష్మి, పాండియరాజన్ లాంటి సీనియర్స్తో కలిసి నటించడం ఆనందంగా ఉందని హీరో అజయ్ దిషన్ చెప్పాడు. విజయ్ ఆంటోని ‘డాక్టర్ సలీం’ చిత్రానికి డీవోపీగా పనిచేసిన తాను ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని దర్శకుడు చెప్పాడు. యూత్కు కనెక్ట్ అయ్యే కంటెంట్తో సందేశాత్మకంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత రామాంజనేయులు తెలియజేశారు.