ఆరేళ్ల క్రితం నేను ఎవరికీ తెలియదు

ఆరేళ్ల క్రితం నేను ఎవరికీ తెలియదు

పెళ్లి చూపులతో మొదలైన తన ప్రయాణం తనను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టిందని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం ‘లైగర్’ ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఇవాళ 'లైగర్' జోడీ విజయ్, అనన్య పాండే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన విజయ్ "లైగర్ పక్కా తెలుగు సినిమా. అయితే దీన్ని హిందీ, తెలుగు రెండు భాషల్లో షూట్ చేశాం. సినిమా కథ విన్నప్పుడు ఓన్లీ తెలుగులో అనుకున్నాం.. కానీ ఇప్పుడు నేషన్ వైడ్ మూవీ అయింది. గతంలో నాకు నచ్చింది చేస్తా అనే ఫీలింగ్ లో ఉండేవాన్ని. కానీ ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చేలా చెయ్యాలి అనుకుంటున్నాను" అని అన్నారు. 

తాను నటుణ్ని కావాలనుకున్న టైంలో ఆడిషన్స్ కు వెళ్తే అవకాశాలు రాకపోవడంతో దర్శకుడు తేజ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినట్లు విజయ్ దేవరకొండ చెప్పారు. ఆ టైంలో చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు పెట్రోల్ ఖర్చులకు కూడా డబ్బులు ఉండవి కాదని గుర్తు చేసుకున్నారు. పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్లకు ఎక్కువ డబ్బుల ఇస్తారని అందుకే తన తండ్రి ఆయన దగ్గర వర్క్ చేయమని చెప్పారని అన్నారు. లైగర్ లో రమ్యకృష్ణ తనకు అమ్మగా చేశారని, ఆమెకు బాలీవుడ్ లో ఫ్యాన్స్ ఎక్కువని విజయ్ దేవరకొండ చెప్పారు. 

లైగర్ మూవీ తన కెరీర్ లో ఛాలెంజింగ్ మూవీ అని సినిమా కోసం ఫిజిక్ మార్చేందుకు ఏడాదిన్నర పట్టిందని విజయ్ చెప్పారు. పూరి ఇచ్చే కంటెంట్ తో ఆడుకోవచ్చని.. కానీ డాన్స్ అంటే తనకు ఏడుపొస్తుందని అన్నారు. మైక్ టైసన్ సినిమాలో నటిస్తాడని తెలియగానే నిజంగానే కొడతాడేమోనని తనతో పాటు తన తల్లి కూడా భయపడిన విషయాన్ని గుర్తు చేసుకున్న విజయ్.. ఆయనతో కలిసి పనిచేయడం మరిచిపోలేని ఫీలింగ్ ఇచ్చిందని చెప్పారు. ఆరేళ్ల క్రితం నేను ఎవరికీ తెలియదు.. రెండేళ్లుగా తన సినిమాలు రిలీజ్ కాలేదని, అయినా లైగర్ ట్రైలర్ కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉందని విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పుడు సండే మాత్రమే చికెన్ ఉండేదని కానీ లైగర్ కోసం గత మూడేళ్లుగా రోజూ చికెన్ తినాల్సి వచ్చిందని విజయ్ వాపోయారు. లైగర్ కోసం చాలా కష్టపడ్డానన్న ఆయన.. షూటింగ్ లో బ్యాక్ ఇంజురీ కూడా అయిందని చెప్పారు. మూవీ ప్రమోషన్స్ వల్ల బాడీ ఇబ్బంది పడుతున్నా మెంటల్ గా ఎంజాయ్ చేస్తున్నానని" అన్నారు.