
బీసీసీఐ అధికారికంగా నిర్వహిస్తున్న అండర్–16 (విజయ్ మర్చంట్ ట్రోఫీ) టోర్నీ లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదు కాని చెత్త రికార్డ్ క్రియేట్ అయింది. మధ్యప్రదేశ్, సిక్కిం మధ్య జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సిక్కిం 9.3 ఓవర్లలో కేవలం 6 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 414/8 రన్స్ చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సిక్కిం.. తొలి ఇన్నింగ్స్ లో 43 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 6 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలింది. మధ్యప్రదేశ్ బౌలర్ల దాటికి 8మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఓపెనర్ గా వచ్చిన అన్వీష్ ఒక ఫోర్ కొట్టి ఔట్ అవగా, తొమ్మిదవ వికెట్ లో వచ్చిన అక్షద్ 2 పరుగులు చేశాడు. దీంతో మధ్యప్రదేశ్ 365 రన్స్ తేడాతో గెలిచింది.