కేసీఆర్ బిడ్డలకైనా మంచి బుద్దులు నేర్పుంటే బాగుండేది : విజయ శాంతి

కేసీఆర్ బిడ్డలకైనా మంచి బుద్దులు నేర్పుంటే బాగుండేది : విజయ శాంతి

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత వ్యవహారశైలిపై బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. ఆమె వీధి రౌడీలా మాట్లాడుతోందని విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి వెళ్లిన విజయశాంతి వారిని పరామర్శించారు. అర్వింద్ ఇంటిపై  దాడి జరగడం దురదృష్టకరమన్న ఆమె.. టీఆర్ఎస్ చర్యను తీవ్రంగా ఖండించారు.

కేసీఆర్ తన బిడ్డలకైనా మంచి బుద్దులు నేర్పి ఉంటే బాగుండేదని విజయ శాంతి అన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. వారే ఏం భాష మాట్లాడితే బీజేపీ కూడా అదే బాష మాట్లాడుతుందన్న ఆమె.. ఇలాంటి దాడుల్ని సహించబోమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి దాడులు చేయడమేంటని విజయ శాంతి ప్రశ్నించారు.