వడ్ల కొనుగోలు విషయంలో ఎనిమిదేళ్లుగా లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందో రైతులు ఆలోచించాలన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. నిజామాబాద్ జిల్లా బోధన్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హుజురాబాద్ ఓటమి, నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతోనే కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ దళారులు కలిసి రైతులకు మేలు చేసే రైతు చట్టాలను అడ్డుకున్నారన్నారు. కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వనని లెటర్ ఇచ్చిన మాట నిజం కాదా కేసీఆర్ చెప్పాలన్నారు. రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదో కేసీఆర్ చెప్పాలన్నారు. రైతులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని.. రైతులు మేలుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదన్నారు. బీజేపీ, ప్రధాని మోడీ రైతుకు అండగా ఉంటుందన్నారు.
మరిన్ని వార్తల కోసం