నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తం : ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్

నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తం : ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్
  • నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తం
  • వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్

పరిగి వెలుగు : కాంగ్రెస్ ని గెలిపించిన ప్రజలకు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వికారాబాద్ లో ఏర్పాటుచేసిన పలు సంక్షేమ కార్యక్రమాల్లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీ పథకాల్లో రెండు పథకాలను ఇప్పటికే ప్రారంభించామని, మిగతా నాలుగు 90 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని.. మంచి పాలన అందిస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.