ఫేక్ ​కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్

ఫేక్ ​కరెన్సీ తయారీ ముఠా అరెస్ట్
  •     రద్దీ ఏరియాలు, చిరు వ్యాపారులు, వృద్ధులే వీరి టార్గెట్

వికారాబాద్, వెలుగు : ఫేక్​కరెన్సీని తయారుచేసి చలామణి చేస్తున్న నలుగురిని వికారాబాద్​పోలీసులు అరెస్ట్​చేశారు. జిల్లా ఎస్పీ నారాయణరెడ్ది తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం ఇందర్​చెడ్ గ్రామానికి చెందిన మండిగి చంద్రయ్య బండల వ్యాపారి. ప్రస్తుతం తాండూరులోని అయ్యప్ప నగర్​లో ఉంటున్నాడు. ఇతను నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా, 90 ఫేక్​రూ.500 నోట్లు దొరికాయి.

చంద్రయ్య ఇచ్చిన సమాచారంతో ఇచ్చాపురం జగదీశ్, బడుగంటి వీరవెంకటరమణ, ప్రగళ్లపాటి శివకుమార్​అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్​జిల్లా దుండిగల్ పరిధి మల్లంపేటలోని అపార్ట్​మెంట్​లో ఉంటున్న జగదీశ్.. ఇంట్లోనే ఫేక్​కరెన్సీ(రూ.500నోట్లు)ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 1,500 ఫేక్​రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు నలుగురు కలిసి చిరువ్యాపారులు, వృద్ధులు, రద్దీ ప్రాంతాలే టార్గెట్​గా దొంగ నోట్లను చలామణి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.