బోటు ప్రమాదంపై ఏడుగురితో విచారణ కమిటీ

బోటు ప్రమాదంపై  ఏడుగురితో విచారణ కమిటీ

వికారాబాద్​, వెలుగు: ఇటీవల వికారాబాద్​ మండలంలోని సర్పన్​పల్లి ప్రాజెక్ట్​లో బోటు బోల్తా పడి ఇద్దరు మహిళా పర్యాటకులు మృతిచెందిన సంఘటనపై విచారణ వేగవంతం చేశారు. ఇందుకోసం కలెక్టర్​ ప్రతీక్​ జైన్​ ఏడుగురు అధికారులతో కమిటీ వేశారు. కమిటీలో ఇరిగేషన్​ ఈఈ మధుసూదన్​రెడ్డి, వికారాబాద్​ ఆర్డీవో వాసుచంద్ర, వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ​, జిల్లా స్పోర్ట్స్​ అధికారి సత్తార్​, సర్వే, ల్యాండ్​ రికార్డ్​ ఏడీ రాంరెడ్డి, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్​ సదానందం, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఉన్నారు. కమిటీ సభ్యులు శుక్రవారం రిసార్ట్​, సర్పన్​ పల్లి ప్రాజెక్ట్​ను సందర్శించి వివరాలు సేకరించారు.