మండలం ఏర్పాటు చేయాలని సర్పంచ్ రాజీనామా

మండలం ఏర్పాటు చేయాలని సర్పంచ్ రాజీనామా

ఆమనగల్లు, వెలుగు : తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ జయమ్మ వెంకటయ్య గురువారం తన పదవికి రాజీనామా చేశారు. మండలం ఏర్పాటు చేయాలని  25 రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ALSO READ :రుణమాఫీపై సీఎం మోసం చేసిండు: కోనేరు సత్యనారాయణ

ప్రభుత్వం దిగి రాకపోవడంతో  18న ఉప సర్పంచ్ బాలస్వామి, 11 మంది వార్డు సభ్యులు రాజీనామా చేశారు.  ఎంపీడీవో శ్రీకాంత్ కు సర్పంచ్ తన రాజీనామా లేఖను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీఓ రఘు, కార్యదర్శి బాలరాజ్, జేఏసీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.