రుణమాఫీపై సీఎం మోసం చేసిండు: కోనేరు సత్యనారాయణ

రుణమాఫీపై సీఎం మోసం చేసిండు: కోనేరు సత్యనారాయణ

జూలూరుపాడు, వెలుగు: రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్​ మోసం చేసిండని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో డీలర్లతో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి యోజన లైవ్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు. ప్రధాని రైతులు వాడే ఎరువులకు భారీ ఎత్తున సబ్సిడీనిచ్చి ఆదుకుంటున్నారన్నారు.

ALSO READ :పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కరించాలి: దొంత నరేందర్

రాష్ట్రంలో ఎరువుల రిటైల్ షాపులు ఇక ప్రధాని కిసాన్ సేవా కేంద్రాలుగా పని చేస్తాయని చెప్పారు. వీటి ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు లభిస్తాయన్నారు. కేసీఆర్ ధనిక  రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి, బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు సతీశ్, శ్రీను, ప్రసాద్, రాజేశ్, డీలర్లు మధుబాబు, సీతారాములు పాల్గొన్నారు.