రోడ్డు కోసం రోడ్డెక్కిన్రు 

రోడ్డు కోసం రోడ్డెక్కిన్రు 

రోడ్డు కోసం ఓ గ్రామస్థులు రోడ్డెక్కారు. తమ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏండ్లుగా రోడ్డు కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో విసిగిపోయిన సయ్యద్ పల్లి గ్రామస్థులు షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.  పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నిరసనకారులు వెనక్కి తగ్గేందుకు నిరాకరించారు. పోలీసులు వారిని పక్కకు లాగే ప్రయత్నం చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 3వేల మంది ఓటర్లున్నా తమ ఊరికి ఇప్పటికీ బీటీ రోడ్డు వేయడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేయకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.