
షాద్ నగర్/చేవెళ్ల, వెలుగు: షాద్నగర్ ఆనంద్నగర్ కాలనీలోని వినాయకుడి లడ్డూలను సోమవారం వేలం వేశారు. స్థానికంగా ఉండే దంపతులు మనోజ్ కుమార్, కీర్తన రూ.5.35లక్షలకు లడ్డూలను దక్కించుకున్నారు. రూ.3 లక్షలకు భర్త ఒక లడ్డూను, రూ.2.35లక్షలకు భార్య మరో లడ్డూను సొంతం చేసుకున్నారు.
చేవెళ్ల అంబేద్కర్ నగర్లోని వినాయకుని లడ్డూకు సోమవారం వేలం నిర్వహించారు. బురాన్బ్రదర్స్రూ.5లక్షల51వేలకు సొంతం చేసుకున్నారు. అంబేద్కర్ కాలనీలోని పోచమ్మ గుడి వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను స్థానికులు పొట్ట రమేశ్, కొట్టెంకి యాదయ్య, గంగి యాదయ్య రూ.3లక్షల25వేల ఒక్క రూపాయికి దక్కించుకున్నారు. రజక నగర్ కాలనీలో గణేశ్లడ్డూను శివకుమార్రూ.4లక్షల ఒక్క రూపాయికి, మల్లికార్జున కాలనీ మండపంలోని లడ్డూను గాలా రెస్టారెంట్ఓనర్లు రూ.3లక్షల11వేలకు పాడారు.