హింసాత్మకంగా యూపీలో బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు

హింసాత్మకంగా యూపీలో బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు

ఉత్తరప్రదేశ్ లో బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అనేక జిల్లాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల బీజేపీ నేతలు, సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. హమీర్ పూర్ లో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. చందౌలీలో SP-BJP కార్యకర్తలు కొట్టకున్నారు. దీంతో వారిపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. చందౌలీలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఉన్నావ్ లో ఘర్షణలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైనా దాడి జరిగింది. ఎటావాలో  SP, BJP కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. లాఠీఛార్జ్ చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో కాల్పులు జరిపారు పోలీసులు. టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు.