మూడున్నరకే 5 లీటర్ల పెట్రోల్!

మూడున్నరకే 5 లీటర్ల పెట్రోల్!

‘ఏదైనా పాత రోజులే బాగుండే కదా! ఆ రోజులు ఇప్పుడు వస్తే బాగుండు’ అంటుంటారు. అప్పుడు తిన్న తిండి, వాతావరణంలా అలా ఉండేది. ఖర్చులు కూడా తక్కువే ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి  పరిస్థితిలేదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. అది చూసిన వాళ్లంతా ఫుడ్, వాతావరణంతో పాటు ఇవి కూడా కావాలంటున్నారు. అసలు ఆ ఫొటోలో ఏముందంటే..   

ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేసిన ఫొటో 1963 ఫిబ్రవరి 2 నాటి పెట్రోల్ రిసిప్ట్. అందులో ఒక వ్యక్తి భారత్ పెట్రోల్ పంప్ నుంచి కేవలం రూ.3.60 పైసలకు 5 లీటర్ల పెట్రోల్ కొంటాడు. అంటే ఒక లీటర్ పెట్రోల్ 72 పైసలన్నమాట. ఆ బిల్ ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఇది చూసిన కామన్ పీపుల్ మళ్లోసారి పెట్రోల్ రేట్లపై మండి పడుతున్నారు. అప్పటి ధరకు కాకపోయినా సామాన్య ప్రజలకు అందుబాటు ధరలోకి తీసుకురావాలని సూచిస్తున్నారు.