
ఉత్తరాధి విహారయాత్రలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు బిజీగా గడుపుతున్నారు. ఈ టూర్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో రిషికేశ్ లో వారు ట్రెక్కింగ్ ఎక్కుతున్న పిక్స్ ను తాజాగా అనుష్క షర్మ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో కూతురు వామికను విరాట్ తన భుజాలపై ఎత్తుకొని ట్రెక్కింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దాంతో పాటు పర్వతాలపై పర్వతం ఉంది.. దాని కంటే పైన ఎవరూ లేరనే క్యాప్షన్ ను అనుష్క జోడించింది. అంతకు ముంది రిషికేశ్ లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమాన్ని ఈ జంట సందర్శించింది. అక్కడ మతపరమైన కొన్ని ఆచారాల్లో వీరు పాల్గొనగా.. దీనికి సంబంధించిన ఫొటో కూడా గత కొన్ని రోజుల క్రితం ట్రెండింగ్ లో నిలిచింది.