సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ

సచిన్ రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ

టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. ఆసీస్తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ వరల్డ్ రికార్డు సృష్టించబోతున్నాడు. కోహ్లీ మరో 64 పరుగులు చేస్తే..ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 25వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. కోహ్లీ ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 546 ఇన్నింగ్స్ లో 24,936 పరుగులు సాధించాడు. సచిన్ 576 ఇన్నింగ్సుల్లో 25 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సిరీస్ లో కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొడతాడు..

ఆరో స్థానంలో కోహ్లీ..

ఇంటర్నేషనల్ క్రికెట్లో 25వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెంబర్ వన్గా కొనసాగుతున్నాడు.  సచిన్‌ తన కెరీర్లో 782 ఇన్నింగ్స్‌ల్లో 34357 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్‌ల్లో 28016 రన్స్ కొట్టాడు. రికీ పాంటింగ్‌ 688 ఇన్నింగ్స్‌ల్లో 27483 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.  మహేళ జయవర్ధనే 725 ఇన్నింగ్స్‌ల్లో 25957 పరుగులతో నాల్గో ప్లేస్లో... జాక్వస్ కలీస్ 617 ఇన్నింగ్స్‌ల్లో 25534 ఐదో  స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత కోహ్లీ 24,936 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. దీంతో ఈ సిరీస్లో మరో 64 పరుగులు చేస్తే.. భారత్ తరఫున 25వేల పరుగులు చేసిన రెండో బ్యాట్స్మన్గా కోహ్లీ నిలుస్తాడు.