మూడు జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు

మూడు జట్లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడు

భారత మాజీ  విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ టెస్టు జట్టు,  ఐసీసీ వన్డే  జట్టుతో పాటు..ఐసీసీ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రతీ ఏడాది టెస్టు, వన్డే, టీ20ల్లో అద్బుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ  బెస్ట్ టీమ్ ను ఎంపిక చేస్తుంటుంది. అయితే  గతంలోనే ఐసీసీ టెస్ట్ టీమ్, వన్డే టీమ్‌ల్లో చోటు దక్కించుకున్నా కోహ్లీ.. తాజాగా ఐసీసీ 2022 బెస్ట్ టీ20 టీమ్‌లోనూ సభ్యుడిగా ఎంపికయ్యాడు. 

గతేడాది జులై వరకు ఫాంలో లేని కోహ్లీ...ఆ తర్వాత  ఆసియాకప్ 2022లో చెలరేగి ఆడాడు. అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదాడు. మొత్తంగా  ఆసియాకప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 276 పరుగులు చేశాడు. ఇక టీ20 వరల్డ్ కప్ లో 296 పరుగులు సాధించాడు. 

విరాట్ కోహ్లీ ఐసీసీ అవార్డులన్నింటిని గెలిచాడు.  ఐసీసీ టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా మూడు సార్లు నిలిచాడు. వన్డే కెప్టెన్‌గా నాలుగు సార్లు ఎంపికయ్యాడు. అంతేకాదు  స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా కోహ్లీని వరించాయి. దశాబ్దపు క్రికెటర్‌గా,  వన్డే క్రికెటర్ ఆఫ్ ది డికేడ్‌గా కూడా కోహ్లీ చరిత్రకెక్కాడు. క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న కోహ్లీ...టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్‌గా ఒకసారి.. వన్డే ఆఫ్ ద క్రికెటర్‌గా మూడు సార్లు నిలిచాడు. టెస్ట్, వన్డే, టీ20 టీమ్ ఆఫ్ ద డికేడ్, టెస్ట్ టీమ్ కెప్టెన్ ఆఫ్ డికేడ్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లలో కలిపి 10 సార్లు ఐసీసీ అత్యుత్తమ ఇయర్ టీమ్స్‌లో కోహ్లీ భాగమవడం విశేషం.