అలా అనొద్దని ఫ్యాన్స్కు సూచించిన కోహ్లీ

అలా అనొద్దని ఫ్యాన్స్కు సూచించిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తోన్న టైమ్లో అభిమానులు ఆర్సీబీ .. ఆర్సీబీ అంటూ కేకలు వేశారు. దీనిపై స్పందించిన కోహ్లీ.. అలా అనొద్దని సైగ చేసి .. తన షర్ట్ పై ఉన్న ఇండియా లోగోను చూపించాడు. ఆ తరువాత అభిమానులంతా ఇండియా.. ఇండియా అంటూ కేకలు వేస్తూ కోహ్లీని ఎంకరేజ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. దటీజ్ కోహ్లీ.. అతనికే దేశమే ముఖ్యం అని కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నాలుగు వికెట్ల కోల్పోయి ఛేదించింది. దీంతో టీమిండియా ఇప్పుడు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 తో ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు ఇరు జట్ల మధ్య మార్చి 1 నుంచి ఇండోర్ లో స్టార్ట్ కానుంది.