పెళ్లిరోజున ప్రతి వధువు చనిపోతుంటే.. థ్రిల్లింగ్ స్టోరీతో విరాటపాలెం వెబ్ సిరీస్

పెళ్లిరోజున ప్రతి వధువు చనిపోతుంటే.. థ్రిల్లింగ్ స్టోరీతో విరాటపాలెం వెబ్ సిరీస్

ఎనభైల్లో మారుమూల గ్రామమైన విరాటపాలెంలో ప్రతి వధువు తన పెళ్లి రోజున చనిపోతుంటుంది.  దాన్నొక శాపంగా భావిస్తారు గ్రామస్థులు. ఆ నమ్మకం భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. దాంతో అక్కడ వివాహాలు ఆపేస్తారు. మీనా అనే ఓ పోలీస్‌‌‌‌‌‌‌‌ కానిస్టేబుల్ ఆ గ్రామానికి వచ్చి ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తుంది. పెళ్లి కూతుర్ల మరణాల కేసు ఎలాంటి మలుపు తిరిగింది అనేది ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌‌‌‌‌‌‌‌’ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ మిగతా కథ. 

గతంలో ‘రెక్కీ’ లాంటి సీట్‌‌‌‌‌‌‌‌ ఎడ్జ్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ను అందించిన మేకర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ సూపర్‌‌‌‌‌‌‌‌నేచురల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తోంది. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించిన ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు కృష్ణ పోలూరు దర్శకుడు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శ్రీరామ్ నిర్మించారు.  జూన్ 27 నుంచి జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ‘‘ఇది కేవలం సూపర్‌‌‌‌‌‌‌‌ నేచురల్ థ్రిల్లర్ మాత్రమే కాదు.. భయం, సత్యం మధ్య జరిగే యుద్ధం. ఓ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ మెసేజ్‌‌‌‌‌‌‌‌తో ఉత్కంఠ భరితంగా  తెరకెక్కించాం’ అని మేకర్స్ తెలియజేశారు.